విజయనగరంః 10 వేల కోట్లతో టూరిజం మిషన్, హెలీ టూరిజం,బీచ్ టూరిజం అంటూ చంద్రబాబు ఊదర కొట్టేశారు అంటూ ట్విట్టర్లో వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ విరాట్ను కన్వెన్షన్ సెంటర్గా మారుస్తానని కన్సల్టెంట్లకు కోట్లు ధార పోశాడని ట్విట్ చేశారు. రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని టూరిస్టు అట్రాక్షన్ చేస్తానన్నాడు. మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని ట్విట్టర్లో ధ్వజమెత్తారు.