బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
విద్యార్థులకు అన్యాయం చేస్తే సహించం
24 Jan 2017 5:59 PM
ఫీజు పోరుతో దద్దరిల్లిన ఇందిరా పార్క్
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంటు పథకానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైయస్ఆర్‡ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైయస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఫీజు పోరు నిర్వహించింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థు లకు కూడా ఉన్నత విద్యనందిం చాలనే ఉద్దేశంతో నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారన్నారు. మహానేత మరణాంతరం ఈ పథకానికి పాలకులు తూట్లు పొడిచారన్నారు. అసెంబ్లీ సాక్షిగా రూ.3,068 కోట్ల ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలను గతేడాది ఏప్రిల్ 1లోగా చెల్లిస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే నేటికీ దాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. గతంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంటు కోసం దరఖాస్తు చేసుకుంటే.. 2016–17లో ఆ సంఖ్య 12.97 లక్షలకు ఎందుకు తగ్గిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు ఎన్నో కల లు కన్నారని, వారం దరికీ ఫీజు రీయింబర్స్మెంటు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు, మెస్చార్జీలు, ఉపకార వేతనాలు సకాలంలో అందని కారణంగా ఈ ఏడాది విద్యాసంస్థల్లో 60% అడ్మిషన్లు తగ్గాయ న్నారు. యాజమాన్యాలు చేస్తున్న అవమానా లకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవా ల్సిన పరిస్థితి దాపురిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి, లక్షలాది మంది విద్యార్థుల భవి ష్యత్తు అంధకారం కాకుండా చూసేందుకు వైయస్ఆర్సీపీ పోరాడుతుందని, ఫీజు పోరు ఉద్యమం ఆగదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, శివకుమార్ హెచ్చరించారు. ఫీజు పోరు ధర్నా కు దాదాపు 4 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా తరలిరావడంతో ఇందిరా పార్క్ దద్దరిల్లింది.