తిత్లీ తుపాన్ న‌ష్టంపై నేడు వైయ‌స్ జ‌గ‌న్‌కు నివేదిక‌

విజ‌య‌న‌గ‌రం: తిత్లీ తుపాను వల్ల భారీ నష్టానికి గురైన ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గతంలోనే రెండు కమిటీలను నియమించారు. ఆ కమిటీల సభ్యులు తుపాను నష్టంపై పార్టీ అధ్యక్షులు జగన్‌కు పాదయాత్ర శిబిరం వద్ద కలిసి ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు నివేదిక అందజేస్తారు. పార్టీ అధ్యక్షుడిని కలిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు పార్టీ సీనియర్ నేతలు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు.  
Back to Top