అవినీతి మంత్రిగా లోకేష్..!

హైదరాబాద్ః చంద్రబాబు సర్కార్ ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తమ్మినేని మండిపడ్డారు. అర్థరాత్రి ఛార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే దొడ్డిదారిన పేదప్రజల నడ్డివిరుస్తున్నారని దుయ్యబట్టారు. 

దసరా రోజు రాష్ట్ర ప్రజలకు రంగుల కల చూపి.. చార్జీల వాత పెట్టారని తమ్మినేని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం ఇచ్చిన దసరా ఆఫర్ ఇదేనా అని ప్రశ్నించారు. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని సీతారాం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. 

చంద్రబాబు అభినవ నీరోగా తమ్మినేని అభివర్ణించారు. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలే అవినీతికి లంచాలు తీసుకుంటున్నామని ఒప్పుకుంటున్నారని.. లోకేష్ ను అవినీతికి మంత్రిగా నియమిస్తే సరిపోతుందని ఎద్దే వాచేశారు. అదేవిధంగా రాజధాని శంకుస్థాపనకు అయిన ఖర్చుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు. 
Back to Top