ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
ఉత్తరాంధ్ర ముంపు ప్రాంతాలకు విజయమ్మ
29 Oct 2013 11:02 AM
శ్రీకాకుళం :
భారీ వర్షాలు, వరదల వల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈ నెల 30న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యటిస్తారని పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు సోమవారం తెలిపారు. గార, పోలాకి మండలాలతో పాటు శ్రీకాకుళం పట్టణంలో నీటిలో మునిగి ఉన్న ప్రాంతాల్లో శ్రీమతి విజయమ్మ పర్యటించి బాదితులను పరామర్శిస్తారని ఆయన వివరించారు.
విజయమ్మ పర్యటనను విజయవంతం చేయండి: కృష్ణదాస్ :
పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ శ్రీకాకుళం జిల్లాలో చేయనున్న పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడంలోను, నష్టాలను అంచనా వేయటంలోను అధికార యంత్రాంగం విఫలమైందని ఆయన విమర్శించారు.