రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
రామభద్రపురం వరకూ షర్మిల నేటి పాదయాత్ర
17 Jul 2013 10:30 AM
మరడాం (విజయనగరం జిల్లా),
17 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 212వ రోజుకు చేరింది. ఈ రోజు ఆమె మొత్తం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. విజయనగరం జిల్లాలో పదవ రోజు కొనసాగే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ పెన్మెత్స సాంబశివరాజు వివరించారు. శ్రీమతి షర్మిల బుధవారం ఉదయం మరడాం, షికారుగంజి జంక్షన్, బూర్జవలస మీదుగా ఆరికతోట వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. భోజన విరామం అనంతరం బూసాయవలస మీదుగా నడిచి రామభద్రపురం చేరుకుంటారు. బుధవారం రాత్రికి శ్రీమతి షర్మిల రామభద్రపురంలో బస చేస్తారని రఘురాం, సాంబశివరాజు తెలిపారు.