ఆయన్ని సాగనంపండి

శాసనసభ ఇంఛార్జ్ కార్యదర్శి మీద
స్పష్టమైన ఆరోపణలు

గవర్నర్ కు ఎమ్మెల్యే ఆర్కే లేఖ

హైదరాబాద్: శాసనసభ
కార్యదర్శిగా వ్యవహరించాలంటే కచ్చితంగా లా డిగ్రీ ఉండాలని, కానీ అదేమీ లేకుండా ఏపీ
శాసనసభకు సత్యనారాయణ ను తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగిస్తున్నారని వైయస్సార్సీపీ మంగళగిరి
ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై తాను సమాచార హక్కు చట్టం
కింద పిటీషన్ వేసినా సమాధానం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. దీంతో సత్యనారాయణ
బండారాన్ని బయట పెడుతూ ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు లేఖ
రాశారు. ఓ పక్క అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటూ.. చట్టవిరుద్ధ
కార్యకలాపాలకు పాల్పడుతూ సరైన అర్హతలు లేకుండానే ఉన్నత పదవిలో కొనసాగిస్తున్నారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.

వివిధ ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న
వ్యక్తిని ఎలా ఆ పదవుల్లో కొనసాగిస్తున్నారని, ఏ
ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి
సత్యనారాయణరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు తన ఆంధ్రప్రదేశ్
శాసన సభ కార్యదర్శిగా పనిచేసేందుకు ఉండాల్సిన అర్హతలు కూడా సత్యనారాయణరావుకు లేవని
అన్నారు.

ఇదీ సత్యనారాయణరావు చరిత్ర

 కే సత్యనారాయణరావు
ఎన్నో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, చట్ట
విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్
స్టేషన్ లో ఓ క్రిమినల్ కేసు కూడా ఉందని.. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులకు
శ్రీవెంకటేశ్వర కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన భూముల విషయంలో అక్రమ
రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని 2012లో కేసు
నమోదైందని చెప్పారు. ఈ కేసులో సత్యనారాయణ ఏ 2గా
ఉన్నారని చెప్పారు. అయితే, అరెస్టు
నుంచి బయటపడేందుకు హైకోర్టుకు కూడా వెళ్లారని వివరించారు. ఈ కేసులో పోలీసులు
చార్జీషీటు కూడా వేశారని, కానీ, ఈ కేసు కోర్టులో విచారణలో ఉండగానే అనూహ్యంగా ప్రభుత్వంలో
అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారని, ఆయన చేసిన
అక్రమాల నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు.



 

 

Back to Top