చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
షర్మిల పాదయాత్ర విజయవంతానికి కృషి
20 Nov 2012 10:40 AM
కాగజ్నగర్:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపడుతున్న పాదయాత్ర విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ అన్నారు. కాగజ్నగర్ ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో షర్మిల చేపడుతున్న పాదయాత్ర ఈ నెల 23న తెలంగాణలోని మహబూబ్నగర్లోకి ప్రవేశిస్తుందన్నారు. మహబూబ్నగర్ పాదయాత్రకు తరలేందుకు జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. వైయస్ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. ప్రాజెక్టు పరిశీలనకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ డిసెంబర్లో సిర్పూర్ నియోజకవర్గానికి రానున్నట్లు తెలిపారు.