ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
షర్మిలకు గద్వాలలో ఘన స్వాగతం
27 Nov 2012 6:30 PM
గద్వాల (మహబూబ్ నగర్ జిల్లా):
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలి వచ్చిన జన సందోహంతో పట్టణ వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. మేడలు, మిద్దెల మీద... ఎటూ చూసినా జనమే కనిపించారు. పట్టణ పుర వీధుల్లో దారి పొడవునా జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
వైయస్ఆర్ కడప జిల్లాలో అక్టోబర్ 18న ప్రారంభమైన షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 41 రోజులు పూర్తి చేసుకుంది. పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర మంగళవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. మంగళవారం నాటికి షర్మిల పాదయాత్ర 554 కిలో మీటర్లు కొనసాగింది.