కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరం
12 Oct 2017 5:44 PM
హైదరాబాద్ః రాష్ట్రంలో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తాన్న చంద్రబాబు...వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. విభజన అనంతరం రాష్ట్రంలో లక్ష 43వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తన స్వ ప్రయోజనాల కోసం ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టడం వల్లే ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగులు మనోధైర్యం కోల్పోవద్దని, విలువైన జీవితాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. కలిసికట్టుగా పోరాడి రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించుకుందామని, మంచి రోజు కోసం వేచిచూద్దామని కోరుతూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.