హైదరాబాద్) హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందులో పాల్గొని జెండా వందనం చేయనున్నారు. ఉదయం 9.30 ని.లకు ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు సీనియర్ నాయకులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. అలాగే వివిధ జిల్లా కేంద్రాల్లోనూ, ఇతర ముఖ్య ప్రాంతాల దగ్గర పార్టీ తరపున రిపబ్లిక్ డే వేడుకలు జరగ నున్నాయి.