మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
'ప్రజాభిమానం ముందు కుట్రలు దిగదుడుపు'
02 Jan 2013 11:11 AM
సత్తెనపల్లి:
రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్రలు పన్ని సీబీఐ సాయంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టించాయని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శ్రీ జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ పట్టణంలో 'జగన్కోసం జన సంతకం' సేకరణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరానికి వికలాంగులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేశారు. శ్రీ జగన్ను అరెస్టు చేసి 210 రోజులు దాటిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకోవడం వల్లే ఆయన్ను జైలు నుంచి బయటకు రానీయకుండా చేస్తున్నాయన్నారు. తమ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందన్న భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సాహసం చేయడం లేదన్నారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.