టీడీపీకి సీమాంధ్రలో రాజకీయ సమాధి తప్పదు

గుంటూరు, 24 నవంబర్ 2013:

సీమాంధ్రలో టీడీపీకి రాజకీయ సమాధి తప్పదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తూ శ్రీ జగన్ ప్రజాస్వామ్య పరిరక్షణకై మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. ఆదివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

కానీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్‌లోనే కూర్చుని మీడియా సమావేశాలకు పరిమితం అయ్యారని అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రపతిని కలిసే హక్కు ఎవరికైనా ఉందని ఆయన అన్నారు. ఓర్వలేని టీడీపీ నాయకులు విమర్శలే పనిగా పెట్టుకున్నారని అంబటి ధ్వజమెత్తారు.

Back to Top