రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఫీజు పథకంపై వరంగల్ విద్యార్థులు ఫైర్
07 Sep 2012 5:27 AM
వరంగల్, 7 సెప్టెంబర్ 2012: కిరణ్ కుమార్రెడ్డి ప్రభుత్వం పేదలను ఉన్నత చదువులకు దూరం చేస్తోందని వరంగల్ విద్యార్థులు మండిపడ్డారు. మహోన్నత ఆశయంతో మహానేత ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోందని వారు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే విద్యార్థుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్పై వైయస్ విజయమ్మ గురువారం నుంచి హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద చేస్తున్న నిరాహార దీక్షకు వారు సంఘీభావం ప్రకటించారు.
ఇంజనీరింగ్ విద్యార్థుల సంఘీభావం : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ విజయమ్మ దీక్షకు ఏలూరు ఇంజనీరింగ్ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా మహానేత వైయస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విజయమ్మ ఫీజు దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, వైయస్ విజయమ్మ ఫీజు దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం, మామిడికుదురులో రెండవ రోజూ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.