వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నిరుద్యోగ దీక్షలకు అనుమతుల నిరాకరణ
02 Oct 2018 11:14 AM
అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురంః ఏపీ వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నిరసనలు కొనసాగుతున్నాయి. అన్ని కేంద్రాల్లో 48 గంటల దీక్ష చేపట్టాయి. కొన్ని చోట్ల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేక ఆంక్షలు పెట్టి నిరుద్యోగుల సంఖ్యను కుదించారని విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షా 20వేల పోస్టులకు 18వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం దారుణమన్నారు. అభ్యర్థుల వయోపరిమితి పెంపు గడువు ముగిసిన స్పందించడం లేదన్నారు. దీక్షలతోనైన మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. అనంతపురంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. వైయస్ఆర్సీపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరించారు.ఆర్డీవో ఆఫీస్ వద్ద దీక్షా శిబిరాలన తొలగించారు. నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి విభాగం నేతలు ఆందోళనలు నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులను ఈడ్చిపడేశారు.పలువురిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.