<strong>పశ్చిమ గోదావరి</strong>: వైయస్ జగన్ను ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. అసలు సిసలు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ వివేకానందరెడ్డి పాల్గొని వైయస్ జగన్ యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.