రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ముడుపుల కోసమే పట్టిసీమః వాసిరెడ్డి పద్మ
06 Jul 2016 2:23 PM
హైదరాబాద్ః పట్టిసీమ పేరుతో వందలకోట్లు దండుకొని చేసిన ప్రారంభోత్సవాన్నే మళ్లీ మళ్లీ చేస్తూ బాబు రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లు బాబు వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరందిస్తామని అబద్ధపు ప్రచారం చేసిన చంద్రబాబు...సీమకు కాదు కదా కనీసం కృష్ణా డెల్టాకు కూడా చుక్క నీరిచ్చిన దిక్కులేదని ధ్వజమెత్తారు. 24 పంపుల ద్వారా నీళ్లు ఇస్తున్నామంటూ కెమెరాల ముందు ఫోజులిస్తూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారు తప్పితే బాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ముడుపుల కోసం మమ అనిపించడానికే బాబు ముచ్చటగా మూడోసారి పట్టిసీమ ప్రారంభోత్సవం చేశారని నిప్పులు చెరిగారు.