బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పర్చూరు సమన్వయకర్త గొట్టిపాటి కన్నుమూత
07 Dec 2013 2:10 PM
హైదరాబాద్, 7 డిసెంబర్ 2013 :
మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గం సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య (51) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. నరసయ్య స్వగ్రామం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో ఆదివారంనాడు అంత్యక్రియలు జరుగుతాయి.
గొట్టిపాటి నరసయ్య 1997 ఉప ఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నరసయ్య తండ్రి గొట్టిపాటి హనుమంతరావు సీనియర్ రాజకీయవేత్తగా, మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం నరసయ్య 97 ఉపఎన్నికల్లో గెలిచారు.