పేటసానిగండ్ల నుంచి ఆరంభమైన పాదయాత్ర

గుంటూరు 27ఫిబ్రవరి 2013:

గుంటూరు జిల్లాలో  మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం  పడుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిలకు వారు ఘనస్వాగతం పలుకుతున్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర బుధవారానికి 76వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆమె పేటసానిగండ్ల నుంచి యాత్రను  మొదలుపెట్టారు. జూలకల్లు, గుత్తికొండక్రాస్‌ మీదుగా పాదయాత్ర సాగుతుంది. అంతకు ముందు షర్మిల కారంపూడిలో పల్నాటి వీరుల దేవాలయాన్ని సందర్శించారు.

Back to Top