హైదరాబాద్) పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన పీఏసీ హైదరాబాద్ లో సమావేశం అయింది. కస్తూర్బా బాలికల పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మీద బుగ్గన మండిపడ్డారు. శ్మశానాల పక్కన పాఠశాలలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారని మండిపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రహారీ గోడలు ఎందుకు ఏర్పాటు చేయటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.