వేలకోట్లు కుమ్మరించినా సాయిరెడ్డి విజయాన్ని అడ్డుకోలేరు

హైదరాబాద్ః తెలుగుదేశం శాసనసభ్యులను బజారున వదిలేసి ...రాజ్యసభ స్థానం కోసం పచ్చ కండువాలు కప్పుకున్న వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశాలు పెట్టడం సిగ్గుచేటని  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తన పంచన చేరిన కుక్కలు, నక్కలతో కుట్ర రాజకీయాలు చేస్తూ....దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.... రాజ్యసభ అభ్యర్థిగా  విజయసాయిరెడ్డి గెలుపొందడం కూడా అంతే తథ్యమన్నారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేల కోట్లు కుమ్మరించినా విజయసాయిరెడ్డి విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. 

Back to Top