తూర్పుగోదావరిః జిల్లాలో వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. కడియం మండలం జేగురుపాడు గ్రామంలో రాజమహేంద్రవరం రురల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్వర్యం లో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మద్దుకూరి బాలు, మేలిమి చంటిబాబు, వరసల జగన్ కోలమూరి అశోక్, మద్దుకూరి శ్రీను, ముంగమూరు సోనీ, నల్లి రమేష్ తదితరులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు . <br/>కార్యక్రమంలో తడాలా విష్ణు చక్రవర్తి, కొత్తపల్లి రాము, సాపిరెడ్డి కామేష్, కొత్తపల్లి మూర్తి ,ఉప్పులూరి వేడుకొండలు, బందుల విష్ణు, బోడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .