<br/><br/>హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేరు వేరు పదవులలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా గుబ్బా చంద్రశేఖర్(వైయస్ఆర్ జిల్లా), డాక్టర్ దుత్తా రామచంద్రరావు(కృష్ణా జిల్లా), ఒంటేరు వేణుగోపాల్రెడ్డి( నెల్లూరు జిల్లా), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరణం ధర్మశ్రీ(విశాఖ జిల్లా)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్హులు వెలుబడ్డాయి.<br/>