తాడేపల్లి: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో పలువురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు మృతి చెందడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.