చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
తీవ్ర సంక్షోభంలో రైతాంగం
23 Dec 2017 11:44 AM
– టీడీపీ హయాంలో రైతుల గోడు పట్టించుకోవడం లేదు
– రైతుల ఆత్మహత్యలు బాధాకరం
– ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల మాదిరిగా రైతులను ఎందుకు చూడరు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు సుబిక్షంగా ఉండేవారని, టీడీపీ ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశానికి ఆహార భద్రత ఇచ్చే అన్నదాతలు ఇంటికి ఆర్థిక భద్రత ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏమాత్రం పాలకులు భరోసా ఇవ్వడం లేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఒకటి చెప్పి..పది చేశారని గుర్తు చేశారు. నాయకుడు అంటే అలా ఉండాలన్నారు. రైతుకు ఎంత ఇచ్చిన కూడా తక్కువే అన్నది మహానేత ఆలోచన అన్నారు. అదే స్ఫూర్తితో ఇవాళ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ముందుకు సాగుతున్నారన్నారు. వైయస్ఆర్ హయాంలో మద్దతు ధరలు పెరిగాయని, ఆహార భద్రత లభించిందన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్నారని, ఏవిధంగా రెట్టింపు చేస్తారని నిలదీశారు. ఉద్యోగులు, ఎమ్మెల్యేల జీతభత్యాలు రెట్టింపు చేసుకున్నారు కానీ, రైతులకు అలాంటి విధానం ఎక్కడైనా వర్తింపజేశారా అని ప్రశ్నించారు. ఇవాళ అతితక్కువ తలసరి ఆదాయం ఉండేది చేనేత కార్మికులు, రైతులదే అని వివరించారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకోండని రైతులకు సూచిస్తున్నారే, అదే ఉద్యోగస్తుల వద్దకు వచ్చే సరికి మీ కుటుంబ అవసరాలు, ఖర్చులు తగ్గించుకోండి అనడం లేదే అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల జీతభత్యాలు తగ్గించుకునే సమయంలో జీతభత్యాలు తగ్గించుకోమని అనలేదే అన్నారు. మేం దాన్ని వ్యతిరేకించడం లేదని, వాళ్ల మాదిరిగానే రైతాంగానికి ఎందుకు ఇవ్వడం లేదన్నది మా డిమాండ్ అన్నారు. ధాన్యానికి పెంచిన మద్దతు ధర ఏడాదికి రూ.50 పెంచేతి ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా ఇక్కడేందుకు మద్దతు ధరలు ప్రకటించడం లేదన్నారు. ఏపీలో వేరుశనగ రూ.3200కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వాలకు మనుగడ లేదని ఆయన హెచ్చరించారు. మహానేత మాదిరిగానే వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని, వైయస్ఆర్ రైతు భరోసా ద్వారా రైతాంగాన్ని ఆదుకుంటామని నాగిరెడ్డి తెలిపారు.