నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
జగన్ను విమర్శించే అర్హత డీకే అరుణకు లేదు
30 Oct 2013 10:58 AM
హైదరాబాద్ :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత మంత్రి డీకే అరుణకు లేదని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. తనను రాజకీయంగా పెంచి పెద్ద చేసిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపైనే ఆమె అర్థరహితంగా ఆరోపణలు చేయడం తగదని గట్టు నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతున్న శ్రీ జగన్పై అరుణ వ్యాఖ్యలు ఎంతమాత్రం తగదన్నారు.
శ్రీ వైయస్ జగన్ సమైక్య శంఖారావం సభలో చెప్పినట్లుగానే కాంగ్రెస్ నాయకులు కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారని గట్టు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనివార్యం అయితే డీకే అరుణ సొంత జిల్లా మహబూబ్నగర్ పూర్తిగా ఎడారిగా మారుతుందన్న వాస్తవాన్ని ఆమె గ్రహించాలని గట్టు రామచంద్రరావు హితవు పలికారు.