చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మతం మాటున నీచ రాజకీయాలు
21 Oct 2012 5:03 PM
హైదరాబాద్, 21 అక్టోబర్ 2012 : షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టిడిపిలు బెంబేలెత్తుతున్నాయని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు.
"షర్మిల పాదయాత్రకు వచ్చిన స్పందన చూడండి. ఢిల్లీ నుండి నామా నాగేశ్వర రావు నుండి చంద్రబాబు దాకా అంతా షర్మిల యాత్ర పైనే మాట్లాడుతున్నారు" అని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ఆర్సీపీని ఎదుర్కోలేక కులాన్నీ మతాన్నీ అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. కొండయ్య కమిషన్ను చంద్రబాబు అమలు పరిస్తే, రాజశేఖర్ రెడ్డి పూజారులకు వేతనాలు వచ్చేలా చేశారని ఆమె గుర్తు చేశారు. ఒక్క పూజారినైనా చెప్పమనండి, చంద్రబాబు హయాంలో మేలు జరిగిందని! అని ఆమె ప్రశ్నించారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆమె ఆరోపించారు.