మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలి: గోనె

హైదరాబాద్ : వైయస్­ రాజశేఖరరెడ్డిని విమర్శించిన మంత్రులంతా రాజీనామా చేయాలని ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌గోనె ప్రకాశరావు గురువారం ఇక్కడ డిమాండు చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను ప్రాంతాలకు అతీతంగా ప్రోత్సహించి వారికి పదవులు కట్టబెట్టిన వైయస్‌ను ఈ మంత్రులు విమర్శించడం సిగ్గుచేటని హైదరాబాద్­లో మీడియా సమావేశంలో గోనె మండిపడ్డారు. వైయస్‌హయాంలో తప్పులు జరిగాయని విమర్శించే మంత్రులకు కేబినెట్‌లో కొనసాగే అర్హత లేనే లేదన్నారు. వారంతా ఈ విషయంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన డిమాండు చేశారు.

వైయస్­ఆర్­సీపీ అధినేత వైయస్­ జగన్మోహన్­రెడ్డిపై కాంగ్రెస్­ నేత వీహెచ్­ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై కూడా గోనె మండిపడ్డారు. చరిత్ర తెలియని వీహెచ్­ వంటివారు ఇటువంటి అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇటీవల తన మంత్రిపదవికి రాజీనామా చేసిన ధర్మానకు మద్దతుగా ఒక్కటవుతున్న మంత్రులు, మోపిదేవి వెంకటరమణ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదని గోనె సూటిగా ప్రశ్నించారు. ధర్మానకు ఒక న్యాయం, మోపిదేవికి మరో న్యాయమా అని అన్నారు.

Back to Top