కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
ప్రధానికార్యాలయం నుంచి జగన్ కు లేఖ
15 Aug 2015 3:21 PM
హైదరాబాద్) ప్రత్యేక హోదా మీద అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. గతంలో ఈ హోదాను కోరుతూ ప్రధానమంత్రి కి రాసిన లేఖకు సంబందించి తిరుగు లేఖ పంపించారు. ప్రత్యేక హోదా పొందేందుకు అవసరమైన అర్హతలు ఆంధ్రప్రదేశ్ కు లేవని ఈ లేఖలో తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం తరపున కేంద్ర వాణిజ్య శాఖ ఉప కార్యదర్శి ఆసిన్ దత్త ఈ లేఖ రాశారు.
ప్రణాళికా సంఘం ఈ హోదాకు సంబంధించిన అర్హతల్ని రూపొందించిందని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ అర్హతలు ఆంధ్రప్రదేశ్ కు అప్లయ్ కావటం లదని స్పష్టం చేశారు. అందుచేత ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే రాష్ట్రానికి న్యాయం చేస్తున్నట్లు వివరించారు. ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్ని ఇప్పటికే ఇచ్చినట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. కొ్త్తగా ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.