రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా శ్రీశైలంగౌడ్

హైదరాబాద్ 15 జూలై 2013:

రంగారెడ్డి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్‌గా ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను నియమించారు. ఈమేరకు సోమవారం ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగిన బి. జనార్థన్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడిగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేశారు.

Back to Top