అనంతపురం: వైయస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు సంఘీభావంగా ధర్మవరం నుంచి గరిసెనపల్లి దాకా కేతిరెడ్డి పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నీచ రాజకీయాలకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ప్రజలకు ద్రోహం చేయటమే అవుతుందని విమర్శించారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైన పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోక్ష్, ఆ శాఖకు మంత్రిగా అనర్హుడని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, అవినీతిపరులను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్ను సీఎం కావాల్సిందే అన్నారు.<br/>