క‌న్నీటి నివాళి

హైద‌రాబాద్‌: మాజీ రాష్ట్ర‌ప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం మృతి ప‌ట్ల వైఎస్సార్ సీపీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. ఆయ‌న సేవ‌ల్ని గుర్తు చేసుకొన్న‌ది.
పార్టీ కేంద్ర కార్యాల‌యం హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్ లో సంతాప కార్య‌క్ర‌మం ఏర్పాటైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్,  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయ్యారు. దేశానికి అబ్దుల్ క‌లాం చేసిన సేవ‌ల్ని స్మ‌రించుకొన్నారు. రాష్ట్రంలోని వివిధ న‌గ‌రాల్లో క‌లాం సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
Back to Top