మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నిరవధిక నిహారదీక్ష శిబిరాన్నిసందర్శించిన వైయస్ జగన్
20 Dec 2018 6:04 PM
శ్రీకాకుళం : కాకరపల్లి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, తమకు న్యాయం జరిగేల చూడాలంటూ కాకరపల్లి థర్మల్ విద్యుత్ వ్యతిరేక పోరాట కమిటి నేతలు వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బోరభద్ర చేరుకున్న వైయస్ జగన్.. 3051వ రోజుకు చేరుకున్న కాకరపల్లి థర్మల్ వ్యతిరేక నిరవధిక నిహారదీక్ష శిబిరాన్ని సందర్శించారు. అక్కడి ప్రజల సమస్యలను థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అక్కడి ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. తంపర భూములను పరిశీలించి స్వదేశీయ మత్స్యకారులకు లీజులు మంజూరు చేయాలని, అక్రమ రొయ్యల కుండీలను తొలగించాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన 1108 జీవోతో సముద్రంలో చేపలు పట్టుకునే హక్కును కోల్పోయామని, జీవనోపాధి లేకుండా పోయిందని వాపోయారు. మత్స్యకారులను ఎస్సీలో చేర్చాలని కోరారు. తిట్లీ తుపానులో గృహాలను కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రతిపక్షనేతకు వినతి పత్రం అందజేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వైయస్ జగన్ బాధితులు హామీ ఇచ్చారు.