'కాంగ్రెస్ పాలనకు చరమగీతం'

రాయదుర్గం:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని వైయస్ఆర్ కాంగ్రెస్  ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సమైక్యాంధ్ర సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యుడు ఆర్వేటి శ్రీనివాస్‌గుప్తా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఐక్యతతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.

Back to Top