గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
ఎమ్మెల్యే..జిందాల్ యాజమాన్యంతో కుమ్మక్కు
25 Sep 2018 12:41 PM
విజయనగరం: స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జిందాల్ యాజమాన్యంతో కుమ్మక్కై తమ కడుపు కొడుతున్నారని జిందాల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 270వ రోజు విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం వైయస్ జగన్ను జిందాల్ కార్మికులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటేటా జీతాలు పెరుగుతున్నాయని, తమకు మాత్రం ఒక్క రూపాయి కూడా పెరడం లేదన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే పరిశ్రమల్లో కార్మికుల జీతాలు కూడా పెరుగుతాయన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, జిందాల్ యాజమాన్యం కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండేళ్లకు ఒకసారి కనీస వేతనాలు అందేలా కృషి చేశారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిందాల్ ప్లాంట్లను ఆపేశారని, 14 నెలల తరువాత కరెంటు చార్జీలు రూ.1.50 తగ్గించి ఫ్యాక్టరీలు తెరిపించారన్నారు. అయితే తమకు కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.