హైదరాబాద్, 6 అక్టోబర్ 2012: జననేత వైయస్ జగన్మోహన్రెడ్డి లోపల ఉన్నా, బయట ఉన్నా ఆయనను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేదని ఆళ్లగడ్డ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలూ ప్రజల్లో విశ్వాసం పూర్తిగా కోల్పోయిన పార్టీలే అని ఆమె అన్నారు.<br/>జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి కాంగ్రెస్, టీడీపీలు ఎంతో గడ్డి కరిచి, కష్టపడ్డాయని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డి జైల్లో ఉంటే తాము చెప్పినట్లు ప్రజలు వింటారని ఆ పార్టీల నాయకులు అనుకుంటున్నాయని ఆమె అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర వల్ల మన రాష్ట్ర ప్రజలకు ఒనగూరే లాభం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. <br/> రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఒకే ఒక్క కోరికతో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో పెద్దన్న పాత్ర చంద్రబాబుదే అని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు, స్థానిక ఎన్నికలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం చంద్రబాబుకు లేదని దుమ్మెత్తిపోశారు.