ప్రజల ప్రాణాలతో ఆటలా

  • సెటిల్‌మెంట్ల ముఖ్యమంత్రిగా మారారు
  • బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతే పట్టించుకోలేదు
  • ఆక్వా బాధితులు ఐదుగురు మృతి చెందినా స్పందించడం లేదు
  • ప్రాణాలు పణంగా పెట్టాలని చూస్తే వైయస్‌ జగన్‌ సహించరు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా 
ఏపీ అసెంబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు సెటిల్‌మెంట్‌ ముఖ్యమంత్రిగా మారారని, మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలు ఫణంగా పెడితే ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహించరని ఎమ్మెల్యే రోజా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆక్వా ఘటనపై చర్చకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ప్రభుత్వం చర్చకు ముందుకు రాకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన తెలిపారు. దీంతో స్పీకర్‌ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే రోజా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 

రోజా ఏమన్నారంటే.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు. సభ ప్రారంభం నుంచి అసెంబ్లీ సమావేశాల తీరు గమనించాలి. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు రావడం లేదు. రైతుల సమస్యలు, అగ్రిగోల్డు బాధితుల వ్యవహారం, పేపర్‌ లీకేజీ, ఆక్వా ఫుడ్‌ ఘటనపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చూశాం. మొన్న రవాణా శాఖ కమిషనర్‌పై టీడీపీ ప్రజాప్రతినిధులు ఎలా దాడి చేసినప్పుడు చంద్రబాబు ఎలా సెటిల్‌మెంట్‌ చేశారో చూశాం. అలాగే నిన్న మొగల్తూరులో జరిగిన ఘటనపై కూడా సెటిల్‌మెంట్‌ చేయడానికి  ముఖ్యమంత్రి కలెక్టర్‌ను, ఎమ్మెల్యేలను,మంత్రులను పంపించాడు. రాష్ట్ర  ముఖ్యమంత్రి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల విష వాయువులు పీల్చి అమాయకులైన ఐదుమంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మొన్న రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోతే పరామర్శించరు. అగ్రిగోల్డులో 105 మంది ఆత్మహత్య చేసుకున్న చంద్రబాబు పట్టించుకోవడం లేదు.  ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోతే ఆయన చితి ఆరకముందే ఆయన కూతురు అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకొని వచ్చి చంద్రబాబు శవ రాజకీయాలు చేశారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎలా దిగజారిపోయారో గమనించాలి. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా పట్టించుకోకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో కాసుల కళ్యాణ్‌ను రంగంలోకి దించి ఆ సమస్యను నీరుగార్చుతున్నారు. నమ్మి ఓట్లు వేసిన వారికి న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. ప్రశ్నిస్తానన్న పవన్‌ కళ్యాణ్‌కు చిత్తశుద్ధి లేకపోవడం దౌర్భగ్యకరమైన విషయం. మీ కమీషన్ల కోసం మనషుల ప్రాణాలతో చెలగాటమాటం ఆడవద్దు. మీ లంచాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టాలని చూస్తే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సహించడు. మిమ్మల్ని వదిలిపెట్టడు. ఆక్వా ఘటనపై చర్చ చేపట్టి తుంద్రురు, మొగల్తూరులో విష వాయువులను ఎదజిమ్మే ఇలాంటి ఫ్యాక్టరీలను అక్కడి నుంచి తరలించి అక్కడి ప్రజలను రక్షించాలి. మొగల్తూరు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలి. దేశమంతా ఒకే చట్టం అమలవుతుంది, మీకొక్కిరికే కొత్త చట్టం లేదు. చట్టప్రకారం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి.
Back to Top