మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పవన్.. నీవు పెయిడ్ ఆర్టిస్టా..!
07 Jul 2015 11:42 PM
విజయవాడ) సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి తప్పు పట్టారు. అసలు చంద్రబాబు అవినీతిచేస్తూ పట్టుబడితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి ఉపన్యాసాలు దంచటాన్ని ఆయన ప్రశ్నించారు. ఓటుకి కోట్లు కుంభకోణం వెలుగు చూసి 35 రోజులు గడిచాక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత కాలం తర్వాత వేరే ఎవరో స్క్రిప్ట్ రాసి ఇస్తే దాన్ని చదివి వెళ్లిపోయారని గౌతమ్ అభిప్రాయ పడ్డారు. అసలు ఇంతకీ పవన్ ప్రెస్ మీట్ కు కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబే అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకీ పవన్ కళ్యాన్ సినీ ఆర్టిస్టా, లేక పెయిడ్ ఆర్టిస్టా..! అని గౌతమ్ సందేహం వ్యక్తం చేశారు.