గాయపడిన అభిమానికి విజయమ్మ పరామర్శ

మహబూబ్‌నగర్‌::::::-: శ్రీమతి షర్మిల పాదయాత్ర సందర్భంగా గాయపడి చికిత్స పొందుతున్న అభిమాని జగన్‌ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆస్పత్రికి వెళ్లి ‌పరామర్శించారు. జడ్చర్ల నుంచి మహబూ‌బ్‌నగర్ వస్తుండగా శ్రీమతి విజయమ్మకు ఈ విషయం తెలిసింది. దీనితో ఆమె మహబూబ్‌నగర్‌ శివార్లలో ఉన్న ఎస్‌విఎస్‌ ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించారు.  శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగళవారంనాడు పాలమూరు విశ్వవిద్యాలయం వద్దకు రాగానే ఆ వర్శిటి ప్రాంగణం నుంచి కొందరు విద్యార్థులు రాళ్ళు, టమోటాలు, కోడిగుడ్లు విసిరారు. ఈ సందర్భంగా టమోటా మీద కాలు వేసిన జగన్ కాలు జారి కిందపడ్డాడు. అతని కాలుపై ఒక వాహనం ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. కాన్వా సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. కాన్వాయ్ సిబ్బంది జగన్‌ను స్థానిక ఎ‌స్‌వీఎస్ ఆసుపత్రిలో చేర్చారు.
Back to Top