<br/>అనంతపురం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాదాల జానకిరాం (67) బుధవారం కన్నుమూశారు. రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో ఆయనను నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జానకిరాం మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. జానకిరాం కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. <br/><br/>