సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
భూములు తీసుకున్నారు.. చేతులు దులుపుకున్నారు..
18 Sep 2018 3:28 PM
నష్టపరిహారం అందక పందలపాక వాసుల ఇక్కట్లు
న్యాయం జరపించాలంటూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు వినతి
విశాఖః భూముల్ని తీసుకుని నష్టపరిహారం కూడా ఇవ్వలేదని విశాఖ జిల్లా పందలపాక వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జననేత వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.ప్రజా సంకల్పయాత్రలో పందలపాక వాసులు వైయస్ జగన్ను కలిశారు. ఇండో టిబెటిన్ క్యాంప్ కోసం భూసేకరణ చేశారని.. 72 ఎకరాలు భూముల్ని తీసుకుని పరిహారం ఇవ్వకుండా నాలుగున్నర సంవత్సరాల నుంచి అధికారులు తప్పించుకుంటున్నారని వాపోయారు. భూములు లేక జీవనోపాధి కోల్పోయి నానా ఇక్కట్లు పడుతున్నామన్నారు. మంత్రి గంటా దృష్టికి కూడా అనేకమార్లు తీసుకెళ్ళామని అయినా న్యాయం జరగలేదన్నారు. ఎక్కడకు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు.వైయస్ జగన్ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో జగనన్నను కలిశామన్నారు. జగన్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.