అల్లాహ్‌ దీవెనలతో అంద‌రికి సకల శుభాలు కలగాలి

 ముస్లిం సోదరులకు వైయ‌స్ జ‌గ‌న్ ఈద్‌ ముబారక్ 

తాడేప‌ల్లి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఈద్‌ ముబారక్‌ (శుభాకాంక్షలు) తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్‌ స్మరణలో తరించే ఈ రంజాన్‌ పండగ, సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ఆయన అన్నారు. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని ఆయన గుర్తు చేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని శ్రీ వైయస్‌ జగన్‌ తన సందేశంలో తెలిపారు.

Back to Top