18 నెలల్లో అంతా నిర్వీర్యం

శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు 18 నెలల పాలనపై నిప్పులు చెరిగారు.  శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు.  65 ఏళ్లుగా రైతాంగానికి వెన్నుదన్నుగా నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థ పరపతిని చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 

గతంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మహిళల పొదుపు విధానం చంద్రబాబు హయాంలో విచ్ఛిన్నం అయిందని ధర్మాన విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు బ్యాంకుల ముందు దోషులగా నిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. వీధి వీధిన రెట్టింపు బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని ధర్మాన మండిపడ్డారు.

Back to Top