ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
18 నెలల్లో అంతా నిర్వీర్యం
12 Dec 2015 12:03 PM
శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు 18 నెలల పాలనపై నిప్పులు చెరిగారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. 65 ఏళ్లుగా రైతాంగానికి వెన్నుదన్నుగా నిర్మించుకున్న ఆర్థిక వ్యవస్థ పరపతిని చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
గతంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మహిళల పొదుపు విధానం చంద్రబాబు హయాంలో విచ్ఛిన్నం అయిందని ధర్మాన విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు బ్యాంకుల ముందు దోషులగా నిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. వీధి వీధిన రెట్టింపు బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని ధర్మాన మండిపడ్డారు.