<p style="text-align: justify;" margin-bottom:0cm="">హైదరాబాద్:ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు సెటిల్మెంట్ మినిస్టర్ అని పిలవాలని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సిగ్గు లేకుండా మహిళా ఉద్యోగిని పిలిపించి మరీ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆమె అబిప్రాయ పడ్డారు. మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేయడం దారుణమని, ఆయనపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని, అలాంటి వారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే తాట తీస్తానన్న చంద్రబాబు..ప్రసుత్తం ఆయనే వెధవ వేషాలు వేస్తున్నారని ఆమె అన్నారు. ఇసుక మాఫియా కు చంద్రబాబు ప్రోత్సాహం</p>