బీసీలకు ప్రాధాన్యత ఏదీ: వకుళాభరణం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేత వకుళాభరణం కృష్ణమోహనరావు బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గురువారం లేఖ రాశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వంద టిక్కెట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చలనం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు పల్లకి మోయడమే సరిపోతోందని వ్యాఖ్యానించారు. తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.

Back to Top