విజయవాడ) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సెక్సు రాకెట్ కేసులో కీలకనిందితుడు పెండ్యాల శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి, తర్వాత కాలంలో తీర్చలేదన్న సాకుతో మహిళల్ని వ్యభిచార ఊబిలోకి దింపుతున్న సెక్సు రాకెట్ గుట్టు కొంత కాలం క్రితం రట్టయింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శ్రీకాంత్ ను పట్టుకోక పోవటం మీద విమర్శలుచెలరేగాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అండగా ఉన్నందునే కీలక నిందితుల్ని పట్టుకోవటం లేదని, ముఖ్యంగా చంద్రబాబు సహా టీడీపీ ముఖ్యనేతలంతా నిందితులతో చెట్టపట్టాల్ వేసుకొని తిరగటంతో పోలీసులు వెనుకంజ వేశారన్న మాట వినిపించింది. ఈ కేసులో యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, విద్యుత్ డీఈ ఎం.సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేశ్లపై కేసు నమోదు చేశారు.