అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
సింగపూర్ కంపెనీలేమైనా మదర్ థెరిస్సా ట్రస్టులా..?
25 Jun 2016 1:41 PM
హైదరాబాద్ః స్విస్ ఛాలెంజ్ లో పారదర్శకత లోపించిందని కేల్కర్ కమిటీ చెప్పినా వినకుండా.... ప్రభుత్వం ఆ విధానాన్ని అవలభించడం దారుణమని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎంతసేపు ప్రజలను దోచుకుందామన్న ఆలోచనే తప్ప అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఓపెన్ టెండర్ పిలుస్తుందని, అవేమీ లేకుండానే బాబు ఇష్టానుసారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అభిమానంతో సింగపూర్ కంపెనీలు మందుకు వచ్చాయని బాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. సింగపూర్ కంపెనీలు ఏమైనా మదర్ థెరిస్సా ట్రస్టులా అని బాబును ప్రశ్నించారు.