మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
17 Dec 2015 2:10 PM
అసెంబ్లీః టీడీపీ నేతల కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మహిళల మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాల్ మనీ కేసుపై చర్చించాల్సిందేనంటూ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ పట్టుబట్టుంది. చర్చకు పట్టుబడుతూ కాల్ మనీ సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలున్నందున..చంద్రబాబు కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని నేతలు విమర్శించారు.
ప్రజాసమస్యలపై చర్చకు డిమాండ్ చేసినందుకు ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు శివప్రసాద్ రెడ్డి, దాడిశెట్టి రాజాలపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేపట్టడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. ప్రతిపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా చంద్రబాబు ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలను ఉసిగొల్పారు. టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రతిపక్ష సభ్యులను సైకో, నియంత అంటూ దుర్భషలాడారు.