ఉత్తరాంధ్ర అగ్రిగోల్డు బాధితుల సమావేశం

విశాఖ‌: అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ బాసట కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం విశాఖ‌లోని మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో నిర్వ‌హించారు.  ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా పార్టీ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ, అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ బాసట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పిరెడ్డి  బాసట కమిటీ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు హాజ‌ర‌య్యారు.  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీలను రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది కన్వీనర్లతో  ఏర్పాటు చేశారు. విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయి సమావేశానికి తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కమిటీల కన్వీనర్లు హాజర‌య్యారు.   జనవరి 3న రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలను నిర్వహించనున్నట్టు నాయ‌కులు తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ధైర్యంగా ఉండాలని, రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  బాధ్యతలు స్వీకరించగానే అగ్రిగోల్డ్‌ నుంచి బాధితులకు ఇవ్వాల్సిన  ప్రతి పైసా వసూలు చేసి ఇస్తారని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండేందుకు వారి కష్టాలను తెలుసుకునేందుకు బాసట కమిటీలు కృషి చేస్తాయని చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితులు మనోధైర్య కోల్పోకుండా, ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడకుండా బాసట కమిటీల సభ్యులకు ధైర్యాన్నిచ్చేందుకు రాష్ట్ర నాయకులు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top