మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాబొచ్చాడు..జాబులు పోయాయి
03 May 2017 8:18 AM
అమరావతి:
బాబొస్తే జాబొస్తుందని చెప్పిన సీఎం చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులకు షాకిచ్చారు. ఆయుష్ విభాగంలో పని చేస్తున్న 800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్ల అవసరం లేదని, జీతాలు ఇవ్వలేమని, వారిని ఇంటికి పంపించండని ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా 2016 – 17లో పని చేసిన 12 నెలల కాలానికి వేతనం కూడా ఇవ్వకూడదని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. తాజా ఉత్తర్వులతో భవిష్యత్లో ఇంకా ఎంత మందిని సర్కారు తొలగిస్తుందోననే భయాందోళన మొదలైంది.